• సీసీ కెమెరాల ద్వారా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ.
• జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలు – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.
సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని, జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్ నుండి సీసీ కెమెరాల ద్వారా బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. పర్యవేక్షిస్తూ, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. ర్యాలీల సందర్భంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని అన్నారు. ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన ముస్లిం మత పెద్దలు, ర్యాలీ నిర్వాహకులు, జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
