బ్రేకింగ్ న్యూస్
నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్దృష్టి మళ్లించి వృద్ధుడి నుంచి 13.5 తులాల బంగారం, రూ.7.4 లక్షల నగదు దోపిడీ — ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్
Telangana

నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్

నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్

నల్లగొండ: కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రిన్సిపల్‌ను హత్య చేసింది ఆమె వద్ద చదువుకున్న ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించారు. గంజాయికి అలవాటు పడటంతో పాటు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, డబ్బు కోసం ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

ఈ నెల 11న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో రూపారెడ్డి హత్యకు గురయ్యారు. ఆమె స్కూల్ నుంచి ఇంటికి చేరుకునేలోపే నిందితులు గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి, వంటగదిలో దాక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. రూపారెడ్డి ఇంటి తాళం తీసుకుని లోపలికి వెళ్లిన తర్వాత ఫ్రెష్ అయి బెడ్‌రూమ్‌లోకి వెళ్లగా.. నిందితులు వెనుక నుంచి వచ్చి కత్తితో దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ దాడిలో రూపారెడ్డిని 27 సార్లు కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న సుమారు రూ.2 లక్షలను తీసుకుని నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు వెల్లడించారు.

‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీ

హత్య అనంతరం ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించేందుకు, సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తీసుకెళ్లిన డబ్బుతో హైదరాబాద్‌లో జల్సాలు చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి చివరకు ఇద్దరు పదో తరగతి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.