బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Hyderabad

ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో బెట్టింగ్ ముఠాలపై కఠిన చర్యలు: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక

ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో బెట్టింగ్ ముఠాలపై కఠిన చర్యలు: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక

క్రికెట్ అనే క్రీడను జూదంగా మార్చి అమాయకుల జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గతంలో చేపట్టిన #SayNoToBettingApps ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, దాని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం అనేక బెట్టింగ్ యాప్‌లను నిషేధించిందని గుర్తు చేశారు.

అయితే ప్రస్తుతం బెట్టింగ్ ముఠాలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయని ఆయన వెల్లడించారు. యాప్‌లపై నిషేధం వచ్చిన తరువాత టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త వెబ్‌సైట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కేవలం ఆన్‌లైన్ మాత్రమే కాకుండా, నగర పరిసరాల్లోని ఇళ్లలో, ఫామ్ హౌస్‌లలో రహస్యంగా సమావేశమై ఫోన్ల ద్వారా ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారని సమాచారం ఉందన్నారు.

ఈ నేపథ్యంలో ఇటువంటి కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానిక బుకీలు యువతను ఆకర్షించి అప్పుల ఊబిలోకి నెట్టుతున్నారని, అవసరమైతే ఇటువంటి నేరస్తులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశ చివరికి పెద్ద నష్టాలకు దారితీస్తుందని, బెట్టింగ్‌లో లాభపడేది నిర్వాహకులే కానీ ఆడేవారు తమ సంపాదన మొత్తాన్ని కోల్పోతారని ఆయన వివరించారు. ఒకసారి ఈ వ్యసనానికి బానిసలైతే కుటుంబాలు ఆర్థిక, మానసిక సమస్యలను ఎదుర్కొని తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని పేర్కొన్నారు.

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగం

ప్రజలు క్రికెట్‌ను కేవలం వినోదంగా మాత్రమే ఆస్వాదించాలని, దాన్ని జూదంగా మార్చుకోవద్దని సూచించారు. నగరాన్ని మరియు యువతను ఈ బెట్టింగ్ భూతం నుంచి కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు.

అదేవిధంగా, పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గమనించినా, లేదా ఎవరో బెట్టింగ్‌కు ప్రోత్సహిస్తున్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు లేదా హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 16555కు సమాచారాన్ని అందించాలని సూచించారు.

ఈ హెచ్చరికలతో నగరంలో బెట్టింగ్ ముఠాలపై పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశముంది.