Breaking News

ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం కొరకు గ్రీవెన్స్ డే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీస్

ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం కొరకు గ్రీవెన్స్ డే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీస్

జిల్లా ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ హాజరై, ప్రజల నుండి వచ్చిన దాదాపు 42 వివిధ ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసాలు, సైబర్ నేరాలు, ఇతర పోలీస్ సంబంధిత సమస్యలపై ప్రజలు తమ అర్జీలను సమర్పించారు.

నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,
“ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం. ప్రతి అర్జీపై చట్టపరంగా న్యాయమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలు పోలీస్ గ్రీవెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలి” అని తెలిపారు.
గ్రీవెన్స్ డేకు హాజరుకాలేని వారు తమ సమస్యలను సంబంధిత పోలీస్ స్టేషన్‌లో లేదా ఆన్‌లైన్ ద్వారా తెలియజేయవచ్చని ఎస్పీ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *