Breaking News

ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే దిశగా పోలీస్ గ్రీవెన్స్ డే: జిల్లా యస్పి శరత్ చంద్ర పవార్ ఐపీయస్

  • -సోమవారం గ్రీవెన్స్ లో పలు ఫిర్యాదులను పరిశీలించి యస్పి

ప్రజా సమస్యలను తక్షణ పరిష్కరించే విధంగా కృషి చేయడమే లక్ష్యంగా ప్రతి సోమవారం పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 37 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై వేగంగా స్పందించి పోలీసు సేవలు అందజేయాలని అధికారులకు యస్పి సూచించారు. ప్రతి ఫిర్యాదుదారునికి భరోసా, నమ్మకం కలిగించాలని, ప్రజల యొక్క ఫిర్యాదులను స్వీకరించడానికి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక విభాగం పని చేస్తున్నదని, ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.

శ్రీరామనవమి ఉత్సవాలకు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు: ఎస్పీ మహేష్ బి. గితే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *