గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణకు 2000 మందితో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు .
సమస్యాత్మక పోలింగ్ కేంద్రం అప్పాజీ పేట గ్రామాన్ని సందర్శించిన జిల్లా యస్పి ..
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
జిల్లా యస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ .

జిల్లా లో గ్రామపంచాయతీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహించడం జరిగిందని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా యస్పి గారు హెచ్చరించారు.
నల్లగొండ రూరల్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రమైన అప్పాజీ పేట గ్రామం సందర్శించి మాట్లాడుతూ మొదటి విడతలో భాగంగా 318 గ్రామ పంచాయితీలలో 466 పోలింగ్ కేంద్రాలు, 2870 పోలింగ్ స్టేషన్ లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి మండలానికి సూమరు 150 చొప్పున 2000 మంది పోలీస్ సిబ్బందితో రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

జిల్లాలో ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు నిర్వహించుటకు క్రిటికల్ పోలింగ్ గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించి ఎన్నికలపై ప్రజల్లో భరోసా కల్పించడం జరిగిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కేసులలోనున్న రౌడీషీటర్స్, త్రిపుల్ మంగ్లర్స్,ను 1141 మందిని చేయడం జరిగిందని అన్నారు
ఎన్నికల సమయంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన, గొడవలు, అల్లర్లు సృష్టించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని 100 మీటర్ల వద్ద 200 మీటర్ల వద్ద ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయని వాటిని పాటించాలని, ప్రజల అనవసరంగా గుమిగూడి ఉండరాదని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలోనికి సెల్ఫోన్లు, వాటర్ బాటిల్ లు, ఇంకు బాటిల్లు, పెన్నులు, అగ్నికి సంబంధించిన వాటికి అనుమతులు ఉండవని తెలిపారు. ఎలాంటి సమాచారం అయినా డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని కోరారు .
