
సంగారెడ్డి జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్టోర్, మోటార్ వెహికల్ స్టోర్ రూమ్లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్ ప్రారంభించారు. గతంలో ఉన్న ఆర్.ఐ. స్టోర్, మోటార్ వెహికల్ స్టోర్ రూమ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రత్యేక దృష్టి సారించి వాటిని ఆధునికరించడం జరిగిందని ఎస్పీ తెలియజేశారు. ఈ స్టోర్లు సిబ్బందికి అందించే కిట్స్, విధి నిర్వహణలో వినియోగించే కిట్స్, టెంట్స్ మరియు క్రీడా సామాగ్రిని సురక్షితంగా భద్రపరచడానికి అనుకూలంగా ఉంటాయని అన్నారు.
మోటార్ వెహికల్ స్టోర్ రూమ్లను ఆధునికరించడం వలన జిల్లాలోని అన్ని పోలీసు వాహనాలకు కావలసిన అన్నిరకాల విడిభాగాలను భద్రపరచడమే కాకుండా, పూర్తి స్థాయి వర్క్షాప్గా కూడా తీర్చిదిద్దినట్లు తెలియజేశారు. అనుభవజ్ఞులు, వృత్తిరిత్య నైపుణ్యం గల సిబ్బంది వాహనాలను సకాలంలో మరమ్మత్తు చేయగలుగుతారన్నారు. ఈ స్టోర్ లను నీట్ గా మెయింటెన్ చేస్తూ సిబ్బందికి అందించవలసిన కిట్ ఆర్టికల్స్ సకాలంలో అందించే విధంగా చూడాలని, మోటర్ వెహికల్ సంబంధించి (నూతన, పురాతన) విడిభాగాలను జాగ్రత్తగా భద్రపరచలాని అధికారులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట ఎ.ఆర్. డి.ఎస్.పి. నరేందర్, ఆర్.ఐలు రామారావు, రాజశేఖర్ రెడ్డి, డానియేల్, శ్రీనివాస్రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

