Breaking News

నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినందించిన – జిల్లా ఎస్పీ.

సంగారెడ్డి పోలీసు స్టేషన్: ఫిర్యాది కె. రమేష్, లలిత ప్రింటింగ్ ప్రెస్ యజమాని తన షాప్ ముందు గుర్తు తెలియని మృతదేహం ఉందని చఠ రిత్య చర్య తీసుకోవాలని ఫిర్యాదు రాగా అప్పటి యస్.హెచ్.ఒ/ ఇన్వెస్టిగేషన్ అధికారి వెంకటేశం, ఇన్స్పెక్టర్ సంగారెడ్డి టౌన్ పోలీసు స్టేషన్, కేసు నమోదు చేసి, దర్యాప్తులో తెలినది ఏమనగా మృతుడు ఉత్తమ రామ యాడ్కే మరియు నిందితుడు సంజయ్ కాంబ్లే లు ఇద్దరు తోడి అల్లుళ్లు, కూలి పని చేసుకొని జీవిస్తున్నారు, ఉత్తమ రామ యాడ్కే సికింద్రాబాద్లో ఒక గురుగు దగ్గర బాణామతి నేర్చుకున్నాడాని, ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని కోపంతో తేదీ: 05-07-2020 నాడు రాత్రి కొత్త బస్టాండ్ సమీపంలో గల లలిత ప్రింటింగ్ ప్రెస్ ముందు బండరాయితో తలపై కొట్టి చంపినట్లు తేలింది, రమేష్ ఇన్స్పెక్టర్, పూర్తి సాక్షాదారాలతో నిందితున్ని కోర్టులో ప్రవేశపెట్టగా, కేసు పూర్వపరాలను విన్న ప్రిన్సిపల్ డిస్ట్రిక్ & సెషన్స్ జడ్జ్ శ్రీమతి భవానీ చంద్ర. నిందితునికి జీవిత ఖైదు, 3000/- రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. సంజయ్ లక్ష్మణ్ కాంబ్లే@ సంజయ్ కాంబ్లే @ సంజు కాంబ్లే తండ్రి లక్ష్మణ్ కాంబ్లే నిందితునికి శిక్షపడేలా కృషి చేసిన అధికారులు అప్పటి యస్.హెచ్.ఒ/ ఇన్వెస్టిగేషన్ అధికారి డి. వెంకటేశం ఇన్స్పెక్టర్, ఇన్వెస్టిగేషన్ అధికారి బి.రమేష్ ఇన్స్పెక్టర్, పోలీసు స్టేషన్, ప్రస్తుత యస్.హెచ్.ఒ రమేష్ ఇన్స్పెక్టర్, పి.పి. టీ. శైలజ, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ రాజు, హెడ్ కానిస్టేబుల్, కోర్ట్ లైజనింగ్ అధికారి రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్, కె. సత్యనారాయణ ఎస్ఐ. లను ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్  అభినందించారు.

వాలెంటైన్స్ డే సందర్భంగా సైబర్ మోసాలపై హెచ్చరిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *