Breaking News

సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెర్వులను సందర్శించిన – జిల్లా ఎస్పీ.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ఎగువ ప్రాంతాల నుండి వచ్చి చేరుతున్న వరద ప్రవాహం వలన సింగూర్ ప్రాజెక్టు కు వరద తాకిడి ఎక్కువ అయిందని, తద్వారా దిగువ ప్రాంతాలకు నీటిని వాదులుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మంజీర డ్యామ్ ను సందర్శించి, డ్యామ్ సామర్ద్యం, నీటి మట్టాన్ని పరిశీలించి, డ్యామ్ నుండి నీటిని దిగువకు వదిలితే ఎదురయ్యే సమస్యలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి మహబూబ్ సాగర్ కొండాపూర్ మండలంలోని తెర్పోల్ గ్రామం చెరువు వద్ద ప్రవహించే అలుగు ను ఎస్పీ ప్రత్యక్షంగా సందర్శించి, ముందస్తు చర్యలు తీసుకోవలసిందిగా అధికారులకు సూచించడం జరిగింది. అలుగు పై నుండి నీరు ప్రవహించేటప్పుడు ప్రజలెవరూ రోడ్డు దాటకుండా చూడాలని అన్నారు. జలాశయాలకు సమీపంలో, లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైతే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, అత్యవసర సమయంలో డైల్ 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712656739 ను సంప్రదించవలసిందిగా సూచించారు. ఈ విజిటింగ్ లో ఎస్పీ వెంబడి సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్, రూరల్ ఎస్ఐ రవీందర్, కొండాపూర్ సిఐ సుమన్ కుమార్, ఎస్ఐ సోమేశ్వరి, కొండాపూర్ ఎం.ఆర్.ఓ, ఇరిగేషన్ అధికారులు తదితరులు ఉన్నారు.

చెర్లపల్లి సెంట్రల్ జైలు సందర్శించిన ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీలు – జైలు సంస్కరణలపై అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *