Breaking News

నల్లగొండ జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)జి.రమేష్ కి మహోన్నత సేవా పథకం.

79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్ అండ్ బి మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ ఐపీఎస్ చేతుల మీదుగా మహోన్నత సేవా పథకం అందుకున్న నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ జి.రమేష్. 1991 సంవత్సరంలో ఎస్ఐగా ఎంపికై 35 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, తాండూరు, వరంగల్,నిజామాబాద్,ఇంటెలిజెన్స్ విభాగాలలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తూ నల్గొండ జిల్లాకు డీఎస్పీగా బదిలీ పై వచ్చి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ గా విధులు నిర్వర్తిస్తూ అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది విధులు నిర్వర్తిస్తూ విధినిర్వాహణలో ఇతను చేసిన సేవలను గుర్తించి మహోన్నత సేవా పథకానికి ఎంపిక కావడం జరిగింది.

అష్టదిగ్బంధనంలో తొర్రుర్ మున్సిపాలిటీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *