
రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్,ఆదేశానుసారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది,నార్కోటిక్ డాగ్, బాంబ్ స్క్వాడ్ ల ద్వారా జన సాంద్రత అధికంగా ఉన్న రద్ది ప్రదేశాలైన బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, లార్జ్ లు,గవర్నమెంట్ ఆఫీసులు మరియు సినిమా థియేటర్లలో తనిఖిలు నిర్వహించి అనుమానితులని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం జరుగుతుందనీ తెలిపారు. జిల్లాలో ఎవరైనా అనుమానిత వ్యక్తుల తిరుగుతూ కనిపిస్తే సంబంధిత పోలీసు స్టేషన్ కి గాని డయల్ 100 కి గాని సమాచారం అందించాలనీ తెలిపారు.

