
ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.కడప జిల్లా జామ్మలమడుగు భాగ్యనగర్ కి చెందిన ముల్లుంటి సలీం మాలిక్ అనే వ్యక్తి ఢిల్లీకి చెందిన సతీష్ అనే వ్యక్తి తో కలసి బాధితులకు ఆరోగ్య శాఖ నుండి మాట్లాడుతున్నాం అంటూ బాధితులకు కాల్స్ చేస్తు హాస్పిటల్ ఖర్చుల రీఫండ్ చేస్తామని చెప్పి బాధితులకు మొబైల్ నుండి కాల్ చేసి వారిని ఒక లింక్ పంపించి ఆ లింకు ఓపెన్ చేసి UPI పిన్ ఎంటర్ చేస్తే మీకు మీ యొక్క ఆరోగ్యశ్రీలో ఖర్చయిన డబ్బులు తిరిగి మీ అకౌంట్లో క్రెడిట్ అయితేయి అని చెప్పాగా బాధితులు నమ్మి ఆలింక్ క్లిక్ చేసి లింక్ లో UPI పిన్ ఎంటర్ చేయడం ద్వారా డబ్బులు కోల్పోవడం జరిగింది. దీంట్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముస్తాబాద్ మండలంలో రాజిరెడ్డి అనే బాధితునికి మరియు వేములవాడ టౌన్ పరిధిలో ఒక బాధితుడికి నేరస్థుడు సలీం మాలిక్ కాల్ చేసి ఆరోగ్య శ్రీ డబ్బులు రిఫండ్ చేస్తానని చెప్పగా బాధ్యతలు నమ్మి UPI పిన్ ఎంటర్ చేయడం ద్వారా ఒకరు ముస్తాబాద్ కి చెందిన రాజిరెడ్డి 46 వేల రూపాయలు,10000 రూపాయలు నష్టపోవడం జరుగగా రాజిరెడ్డి పిర్యాదు మేరకు ముస్తాబద్ ఎస్.ఐ గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్, ఆదేశాల సిరిసిల్ల రూరల్ మొగిలి, ముస్తాబద్ ఎస్.ఐ గణేష్,జిల్లా సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్, సిబ్బంది కిట్టు, గంగారెడ్డి,ముస్తాబాద్ కానిస్టేబుల్ కాసిం టీమ్ గా ఏర్పడి సాంకేతికత ఆధారంగా హైదరాబాద్ నిందుతుణ్ణి అరెస్ట్ చేయడం జరిగిందని,నిందుతుడు సలీం మాలిక్ పైన రెండు తెలుగు రాష్ట్రాలలో 79 పిటిషన్ లలో సుమారుగా 60 లక్షల రూపాయల వరకు మోసాలకు పాల్పడటం జరిగిందని నిందుతుణ్ణి రిమాండ్ చేయడం జరిగిందని, సతీష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని అతన్ని త్వరలోనే పట్టుకోవడం జరుగుతుందన్నారు.