Breaking News

రాష్ట్ర స్థాయి పోలీసు డ్యూటీ మీట్లో సత్తా చాటిన – సంగారెడ్డి జిల్లా సైబర్ సెల్ పోలీస్ కానిస్టేబుల్.

• పూణెలో జరిగే నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్ కు అర్హత సాధించడం జరిగింది.
• రాజలింగం ను అభినందించిన జిల్లా ఎస్పీ పరితోష పంకజ్ ఐపిఎస్.
గత జూలై 31 నుండి ఈ నెల 2వ తేదీ వరకు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్, వరంగల్ లో జరిగిన రాష్ట్ర స్థాయి పోలీసు డ్యూటీ మీట్ నందు సంగారెడ్డి జిల్లా నుండి చార్మినార్ జోన్ తరుపున రాష్ట్ర స్థాయి పోలీసు డ్యూటీ మీట్ కు హాజరైన రాజలింగం, కంప్యూటర్ అవేర్నెస్ టెస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలవడం జరిగిందని, రాష్ట్ర స్థాయిలో జిల్లా పేరును ముందు ఉంచడంలో మంచి ప్రతిభ కనబరిచాడని, రాజలింగం ను ఎస్పీ అభినందించారు. తదుపరి పూణెలో జరిగే నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్ లో మెరుగైన ప్రదర్శన చూపి రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని అన్నారు.

డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన 58 మందికి జరిమానాలు-సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *