
అక్రమంగా గంజాయి సేవించిన, క్రయవిక్రయాలు జరిపిన,కఠిన చర్యలు తప్పవు. 109 గ్రాముల గంజాయి,రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం. ముస్తాబద్ మండలం గూడెం గ్రామానికి చెందిన సూర అజయ్ s/o రమేశ్,age.19 సుర ప్రదీప్ s/o నర్సయ్య 18 yrs, వడ్డెర r/o గూడెం గ్రామం అను ఇద్దరు వ్యక్తులు గంజాయికి అలవాటు పడిన వారికి ఎక్కువ ధరలకు అమ్ముతూ వాటితో జల్సాలు చేస్తుండేవారు. గూడెం గ్రామంలోని పెద్దమ్మ దేవాలయం దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు నిషేధిత గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు ముస్తాబద్ ఎస్.ఐ గణేష్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లగా అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద 109గ్రాముల గంజాయి ఉండగా అట్టి నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని సి.ఐ మొగిలి తెలిపారు. అక్రమంగా గంజాయి సేవించిన, క్రయవిక్రయాలు జరిపిన,కఠిన చర్యలు తప్పవని ఈసందర్భంగా హెచ్చరించారు. యువత డ్రగ్స్ భారినపడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ లు ,నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ గంజాయి రవాణాపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు. జిల్లాలో గంజాయికి సంబంధించిన సమాచారం సబంధిత పోలీస్ వారికి సమాచారం అందించి గంజాయి రహిత జిల్లాగా మర్చడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.