కూకట్పల్లి, సెప్టెంబర్ 29 : (సూర్యోదయం) కూకట్పల్లి పోలీసులు ఇంటి దొంగతనాలపై పహారా నిర్వహిస్తుండగా ముగ్గురు నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 290 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ఐ20 కారు, కేనన్ 5డి మార్క్ 3 కెమెరా తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 36 లక్షలుగా అంచనా. సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 8:30 గంటలకు ఉషాముల్లపూడి ఎక్స్ రోడ్ వద్ద పెట్రోలింగ్ చేస్తూ అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద బంగారు ఆభరణాలు బయటపడడంతో విచారణ చేపట్టి, రెండు ఇళ్ల దొంగతనాలకు సంబంధం ఉన్నట్లు తేలింది. దర్యాప్తును మరింతగా విస్తరించగా మరో ఇద్దరు నిందితులు బయటపడ్డారు.
1.ఆర్యన్ యోగేష్ ధకన్ – రెండు ఇళ్ల దొంగతనాలు (విలువ సుమారు 30 లక్షలు). 2. మాస్సి సురేష్ – ఒక ఐ20 కారు దొంగతనం (విలువ సుమారు 4 లక్షలు) 3. అల్లూరి పవన్ – కేనన్ 5డి మార్క్ 3 కెమెరా దొంగతనం (విలువ సుమారు 2.5 లక్షలు).
ముగ్గురు నిందితులు చెడు అలవాట్లకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలానగర్ డీసీపీ కె . సురేష్ కుమార్ ఐపీఎస్ పర్యవేక్షణలో, కూకట్పల్లి డివిజన్ ఏసిపి ఈ . రవికిరణ్ రెడ్డి, సీఐ కె వి సుబ్బారావు, డిఐ ఎం . కొండలరావు, క్రైమ్ ఎస్ఐ జి. రవీందర్ రెడ్డి, సిబ్బంది కలిసి ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తిచేశారు.
