వి.సి. సజ్జనర్, ఐపీఎస్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా, వికలాంగుల నెట్వర్క్, ఫ్రీడమ్ అసోసియేషన్, ట్రిపుల్ ఆర్ ఫౌండేషన్ మరియు NAMC ట్రస్ట్ సంయుక్తంగా దివ్యాంగులకు ఉచిత వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమాన్ని బంజారాహిల్స్, రోడ్ నెం. 12లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ వి.సి. సజ్జనర్ స్వయంగా లబ్ధిదారులకు వీల్ చైర్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ వి.సి. సజ్జనర్ మాట్లాడుతూ, “హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇంత మంచి సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. సమాజంలోని నిస్సహాయులకు, ముఖ్యంగా దివ్యాంగులకు అండగా నిలవడం మనందరి బాధ్యత. కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా, మానవతా దృక్పథంతో ప్రజలకు సేవ చేయడంలో కూడా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలకు హైదరాబాద్ నగర పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది,” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (శాంతిభద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్; స్పెషల్ బ్రాంచ్ డీసీపీ కె. అపూర్వ రావు, ఐపీఎస్; లతో పాటు వికలాంగుల సంఘాల నాయకులు ఎం. శ్రీనివాసులు, సలహాదారులు, ప్రముఖ న్యాయవాది రాపోలు భాస్కర్, డాక్టర్ విజయభాస్కర్, సినీ, టీవీ నటుడు లోహిత్ కుమార్, చిదమ్ శ్రీనివాస్, పీడబ్ల్యూఏ (PWA) ట్రస్ట్ నుండి చిరంజీవులు, ఎన్ఏఎంసీ (NAMC) ట్రస్ట్ నుండి సామ్రాజ్య లక్ష్మి, టీవీహెచ్ఎస్ (TVHS) నుండి కె. కిరణ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

