
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అవినీతి నిరోధకశాఖ సంచాలకులు డాక్టర్ తరుణ్ జోషి, ఐ.పి.ఎస్., అవినీతినిరోధకశాఖ ప్రధాన కార్యాలయములో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిననారు. ఈ కార్యక్రమములో “అవినీతి నిరోధకశాఖ అధికారులతో పాటుగా పాఠశాల విద్యార్థులు” పాల్గొన్నారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంచిపెట్టినారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్బంగా 21 మంది అధికారులకు వారి విస్తృత సేవలను గుర్తించి ప్రభుత్వము వివిధ రకాల పతకాలు ఇవ్వగా డైరెక్టర్ వారి స్వహాస్తాలతో మహోన్నత (1), ఉన్నత (4) & సేవా (16) పతకాలు సంబంధిత అధికారులకు ప్రధానం చేసి వారిని అభినందించారు.

