
79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ ఐ.పి.యస్,జిల్లా పోలీస్ క్యాంప్ కార్యాలయంలో గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతకాన్ని ఎగరవేసిన అనంతరం జాతీయ గీతాలాపన ఆలపించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో స్వాతంత్ర పోరాట యోధుల త్యాగ ఫలితమే మనం ఈ రోజు భారత దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రశాంత వాతావరణములో గర్వంగా జరుపుకుంటన్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ , రమేష్, నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి,డి.సి.ఆర్.బి డీఎస్పీ రవి, ఏ.ఆర్ డిఎస్పీ శ్రీనివాసులు,సీఐలు రాఘవరావు, రాజశేఖర్ రెడ్డి, రాము,శ్రీను నాయక్, మహా లక్ష్యయ్య ,జితేందర్ రెడ్డి ఆర్.ఐ లు సంతోష్,నరసింహ శ్రీనివాస్ యస్.ఐ లు,పోలీసు అధికారులకు సంఘం అధ్యక్షుడు జయరాజు,మరియు సిబ్బంది పాల్గొన్నారు.

