
రేపు తేదీ:15.08.2025, 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడం జరిగిందని, ఈ సందర్భంగా సిబ్బంది పరేడ్ ప్రాక్టీస్ ను ఎస్పీ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరేడ్ గ్రౌండ్స్ ను జాగిలాలతో, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేయిస్తూ. అన్నిరకాల భద్రతపరమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మాత్యులు సి.దామోదర రాజనర్సింహ ప్రధాన అతిథిగా హాజరై జాతీయ జండాను ఆవిష్కరించనున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ వివరించారు.

