Breaking News

జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించిన-మల్టీ జోన్-II ఇంచార్జ్ ఐ.జి. తఫ్సీర్ ఇక్బాల్ ఐపిఎస్.

• సంగారెడ్డి జిల్లా పోలీసుల పని తీరు బాగుంది.
• మాదక ద్రవ్యాల నిర్మూలనకై ఏర్పాటు చేసిన ఎస్-న్యాబ్ ద్వారా సత్: ఫలితాలు.
• ప్రభుత్వ నిషేదిత గంజాయి సాగు, అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపాలి.
• రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో నిఘా కట్టుదిట్టం చేయాలి.
• మారుతున్న సమాజానికి అనుగునంగా పోలిసింగ్ లో మార్పులు రావాలి.
• జరిగిన నేరాన్ని ఛేదించడం కంటే, నేరం జరగకుండా నిరోదించడం చాలా ముఖ్యం.
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించిన మల్టీ జోన్-II ఇంచార్జ్ ఐ.జి. తఫ్సీర్ ఇక్బాల్ ఐపిఎస్, జిల్లా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జిల్లా ఎస్పీ తో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం, పోలీసు పరేడ్ గ్రౌండ్, మోటార్ వెహికల్ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల నేరాలు, రోడ్డు ప్రమాదాలు నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి ఐ.జి. కి వివరించడం జరిగింది. పోలీసుల యొక్క విధులను ప్రతి ఒక్కరూ తెలుసుకొని సమర్థవంతంగా విధులను నిర్వహించాలని, సమాజంలో శాంతిని నెలకొల్పడంలో పోలీసుల పాత్ర చాలా కీలకం అన్నారు. అధికారులు సిబ్బంది తమ పరిధిలో గల గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ముఖ్యంగా యువత ఎలాంటి చెడు అలవాట్లకు భానిసలవుతున్నారని గుర్తించాలన్నారు. జరిగిన నేరాన్ని ఛేదించడం కంటే, నేరం జరగకుండా నిరోదించడం చాలా ముఖ్యం అని అన్నారు. వృత్తిపరంగా ఉత్తమ విధులు నిర్వహించిన అధికారులకు ఉన్నత అధికారులచే గుర్తింపు లభిస్తుందన్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా పోలీసింగ్ లో మార్పులు తీసుకురావాలని, సిబ్బంది ప్రతి ఒక్కరు కంప్యూటర్ పరిజ్ఞానంపై దృష్టి సారించాలని అన్నారు. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్ట్యా తమ తమ ప్రాంతాలపై దృష్టి సారించాలని, ఎలక్షన్స్ సజావుగా జరగడానికి కావలసిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో అల్లర్లు సృష్టించిన వారిని, పాత నేరస్తులని గుర్తించి ముందస్తూగా బైండ్ ఓవర్ చేయాలని చేయాలని అధికారులకు సూచనలు చేశారు. నేరాలు జరగకుండా, జరిగిన నేరాలను చేధించడంలో కీలకంగా ఉపయోగపడే సిసి కెమెరాలు ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలని, వివిధ కంపెనీలు, షాప్ లు, పెట్రోల్ పంపులు, ధాబాల వంటి తదితర ప్రాంతాలలో యజమానులతో మాట్లాడి సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా మన చుట్టూ జరుగుతున్న వివిధ రకాల ఆస్థి సంభందిత, సైబర్ నేరాల మరియు ఆయా ప్రాంతాలలో చోటుచేసుకుంటున్న సమస్యల గురించి, ముడనమ్మకాల పై ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐ.జి. మాట్లాడుతూ.ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉండటం వలన ఆస్థి సంభందిత నేరాలు జరిగినప్పటికి అట్టి నేరాలను ఛేదించడడంలో సంగారెడ్డి జిల్లా పోలీసు మెరుగ్గా పనిచేస్తుందని, గంజాయి వంటి ఇతర మాదక ద్రవ్యాలను జల్లా నుండి అక్రమ రవాణా జరగకుండా నివారించడంలో, జరిగిన నేరాలను ఛేదించడంలో జిల్లా లో ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంతో విజయాలను అందుకోవడం జరుగుతుంది అన్నారు. ట్రాఫిక్ సమస్యను నివారించడంలో సిగ్నల్స్ ఏర్పాటు, సిసి కెమెరాల ఏర్పాటు చేయడంలో జిల్లా ఎస్పీ చేస్తున్న కృషి, జిల్లా యంత్రాంగం పనితీరు అభినంధనీయమని, సంగారెడ్డి జిల్లా పోలీసుల పని తీరు బేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎ.సంజీవ రావ్, డిటిసి అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావ్, సంగారెడ్డి డియస్పి సత్యయ్య గౌడ్, పటాన్ చెర్వు డియస్పి ప్రభాకర్, జహీరాబాద్ డియస్పి సైదా నాయక్, నారాయణఖేడ్ డియస్పి వెంకట్ రెడ్డి, డిటిసి డియస్పి సురేందర్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ. కళ్యాణి, ఎఆర్ డియస్పి నరేందర్, మరియు జిల్లా ఇన్స్పెక్టర్స్, సబ్-ఇన్స్పెక్టర్స్, ఆర్.ఐలు రామ రావ్, రాజశేఖర్, డానియెల్, శ్రీనివాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రౌడీ సీటర్ అప్పు వివాదం హత్యకేసులో నిందితుల అరెస్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *