బ్రేకింగ్ న్యూస్
ప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శన
Telangana

ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా, ఆగస్టు 26: ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే ర్యాలీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్., ముస్లిం మత పెద్దలు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులకు సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ముస్లిం మత పెద్దలు, ర్యాలీ నిర్వాహకులతో పీస్ మీటింగ్ నిర్వహించారు. ర్యాలీలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు.

ఒకరి మత సంప్రదాయాలను మరొకరు గౌరవించుకున్నప్పుడే సమాజంలో మత సామరస్యం మరింత బలోపేతం అవుతుందని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ర్యాలీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఫేక్ మెసేజ్‌లను నమ్మొద్దు

వాట్సాప్ తదితర సోషల్ మీడియా గ్రూపుల్లో సర్క్యులేట్ అయ్యే ఫేక్ న్యూస్, ఫార్వర్డ్ మెసేజ్‌లను ప్రజలు నమ్మవద్దని ఎస్పీ సూచించారు. తమకు వచ్చిన ఏదైనా సందేశం నిజమా కాదా అని నిర్ధారించుకున్న తర్వాతే ఇతరులకు ఫార్వర్డ్ చేయాలని తెలిపారు.

ప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్

అనుమానాస్పదమైన మెసేజ్‌లు లేదా సోషల్ మీడియా పోస్టులు కనిపిస్తే వాటిపై స్పందించకుండా సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫార్వర్డ్ మెసేజ్‌ల ద్వారా అనవసర గొడవలు, అల్లర్లకు కారణమయ్యే విధంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు.

ప్రజలు, మత పెద్దలు, ర్యాలీ నిర్వాహకులు పోలీసులకు సహకరిస్తూ ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని పోలీసులు కోరారు.